Tuesday, 28 October 2025

ఇకపై ట్రూకాలర్ అవసరం లేకపోవచ్చా?



  •  కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు డిఫాల్ట్‌గా చూపించేందుకు సిఫార్సు


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మంగళవారం ప్రకటించిన ప్రకారం.. టెలికాం శాఖ (డీఓటీ)తో కలిసి కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు. కనెక్షన్ కోసం ఉపయోగించిన గుర్తింపు ప్రకారం కాల్ అందుకునే వ్యక్తికి ఆటోమేటిక్‌గా (డిఫాల్ట్‌గా) చూపించేందుకు అంగీకరించింది. 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన ‘టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ( సీఎన్‌ఏపీ) పరిచయం’పై ట్రాయ్‌ సిఫార్సుల్లో, ఈ సేవను కేవలం కాల్ అందుకునే సబ్ స్క్రైబర్‌ అభ్యర్థన మేరకే ప్రారంభించాలని సూచించింది. అయితే, డీఓటీ ట్రాయ్‌కి తిరిగి పంపిన సూచనలో మార్పు కోరుతూ, సీఎన్‌ఏపీ సేవను డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంచి, అవసరం లేని వారు దానిని డిసేబుల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా సీఎన్‌ఏపీ సేవను ప్రారంభించే ప్రయత్నం మోసపూరిత కాల్స్‌ను నివారించడం, “డిజిటల్ అరెస్ట్”, ఆర్థిక మోసాలు వంటి సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రారంభించబడింది.


డీఓటీ, ట్రాయ్‌,సిఫార్సులను అంగీకరించే అవకాశం ఉంది, అందులో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (సీఎల్‌ఐఆర్‌) సదుపాయం పొందిన సబ్స్క్రైబర్ల పేరు కాల్ అందుకునే వ్యక్తికి చూపించకూడదని పేర్కొంది. సీఎల్‌ఐఆర్‌ సదుపాయం సాధారణ సబ్స్క్రైబర్లు, కేంద్ర గూఢచారి సంస్థల అధికారులు మరియు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


సాధారణ సబ్స్క్రైబర్ల విషయంలో టెలికాం ఆపరేటర్లు పూర్తి ధృవీకరణ చేసి, చట్ట అమలు సంస్థలకు అవసరమైనప్పుడు సమాచారం అందించేలా ఉండాలి. ఈ సదుపాయం బల్క్ కనెక్షన్లు, కాల్ సెంటర్లు, టెలిమార్కెటర్లకు అందుబాటులో ఉండదు.


ట్రాయ్‌, డీఓటీ రెండూ ఈ సేవను 4G మరియు దాని కంటే అధిక సాంకేతికతలు ఉపయోగించే వినియోగదారులకు డిఫాల్ట్‌గా అందించాలని నిర్ణయించాయి, ఎందుకంటే 2జీ,3జీ వినియోగదారుల కోసం ఈ ప్రక్రియను అమలు చేయడం బ్యాండ్‌విడ్త్ పరిమితుల కారణంగా సాంకేతికంగా కష్టతరమని పేర్కొన్నాయి.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...