జనవాక్కు: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్కు టీమ్ ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. హర్షిత్ను కోచ్ గౌతమ్ గంభీర్ బంధుత్వం కారణంగా ఎంపిక చేశారని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించగా, సోషల్ మీడియాలో కూడా రాణాపై ట్రోలింగ్ జరిగింది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత గంభీర్ మీడియాతో మాట్లాడారు. “23 ఏళ్ల యువ ఆటగాడిని టార్గెట్ చేయడం సిగ్గుచేటు. యూట్యూబ్ వ్యూస్ కోసం యువ క్రికెటర్ను ట్రోల్ చేయడం సరికాదు. నన్ను టార్గెట్ చేయాలనుకుంటే చేయండి, నేను హ్యాండిల్ చేస్తాను. హర్షిత్ తన సొంత అర్హతతో ఎంపికయ్యాడు. యువ ఆటగాళ్లను విమర్శించడం మానండి” అని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్ ఆడతారా అనే ప్రశ్నకు, “ప్రపంచ కప్కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనపై దృష్టి పెట్టాలి. రోహిత్, కోహ్లీ నాణ్యమైన ఆటగాళ్లు, వారు ఈ సిరీస్లో రాణిస్తారని ఆశిస్తున్నాం” అని గంభీర్ సమాధానమిచ్చారు. రో-కో ద్వయం ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో ఆడనుంది. టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

No comments:
Post a Comment