Tuesday, 14 October 2025

తప్పిపోయిన పిల్లల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు



జనవాక్కు: తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో నోడల్ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘గురియా స్వయం సేవి సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.  నోడల్ అధికారుల వివరాలను ఆన్‌లైన్‌తో సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ వివరాలతో ఒక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించాలని కోర్టు సూచించింది. ఈ పోర్టల్‌లో అదృశ్యమైన పిల్లలపై ఫిర్యాదులు అందిన వెంటనే నోడల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. ఫిర్యాదుల ఆధారంగా కిడ్నాపర్‌లపై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...