హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గారు, 'మీ పిల్లలను కిడ్నాప్ చేశామని' పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించినా మానసికంగా ఆందోళన చెందవద్దని, భయపడొద్దని సూచించారు. ఈ బెదిరింపుల గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు, ఆయన ఒక నకిలీ కాల్తో కూడిన వీడియోను కూడా తమ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అత్యాశ, భయం - ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే, అవగాహనతో కూడిన అప్రమత్తత చాలా అవసరం" అని తెలిపారు. ప్రజలు తమ పిల్లలు లేదా బంధువుల వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ గారు కోరారు. అలాగే, హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయడం ద్వారా గానీ, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ అయిన
No comments:
Post a Comment