హైదరాబాద్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ (HAM) విధానంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఆ నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోడ్లను 30 నెలల్లో నిర్మించి, ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతను కూడా సంస్థలే చేపట్టాలి.
మొదటి విడతలో రూ. 6,294 కోట్లు ఖర్చుతో 2,162 రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మొత్తం 17 ప్యాకేజీలలో 7,449 కిలోమీటర్ల మేర రోడ్లను పంచాయతీరాజ్ శాఖ నిర్మించనుంది.
No comments:
Post a Comment