Sunday, 21 June 2026

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

 

  • పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్
  • మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్
  • దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత మొదటి సంతానానికి సిద్ధమైనట్లు జాతీయ మీడియా వెల్లడి
  •  చైతన్యతో విడిపోయిన తర్వాత 2025 డిసెంబర్‌ లో రాజ్‌ ను పెళ్లాడిన సామ్!



స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులుగా తన తాజా చిత్రం "మా ఇంటి బంగారం" సాధించిన ఘనవిజయంతో పాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి జరుపుకున్న ఒక వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత గర్భవతి  అయ్యిందనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే సమంత దంపతులు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నారని, ఆమె గర్భం దాల్చిన విషయం నిజమేనని జాతీయ వార్తా సంస్థ ‘ఎన్‌డీటీవీ’ కి విశ్వసనీయయ సమాచారం అందింది. ఈ తాజా వార్తలపై అటు సమంత కానీ, ఇటు రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ.. ఈ పరిణామం సమంత గతంలో మాతృత్వం గురించి మాట్లాడిన ఒక పాత ఇంటర్వ్యూను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒకప్పుడు తాను మొదటి బిడ్డను ప్రపంచంలోకి ఆహ్వానించడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని లేదా గడువును  కూడా ముందుగానే ఫిక్స్ చేసుకున్నట్లు సామ్ వెల్లడించడం విశేషం.



తిరిగి 2018 సంవత్సరంలో, నటుడు నాగచైతన్యతో వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత ‘ఫిల్మ్ కంపానియన్’ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతకు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె తనదైన శైలిలో నవ్వుతూ స్పందిస్తూ.. తాను, చైతన్య కలిసి ఒక బిడ్డను ఎప్పుడు కనాలనుకుంటున్నామనే విషయంపై అప్పట్లోనే చర్చించుకున్నట్లు వెల్లడించింది. "మేము బిడ్డ కోసం ఒక డేట్ (తేదీ) కూడా ఫిక్స్ చేసుకున్నాం! అయితే మేము అనుకున్న తేదీ ప్రకారమే అంతా జరుగుతుందని నేను అనుకోను కానీ.. చైతన్య మాత్రం మేము నిర్ణయించిన సమయానికే అది జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఏదేమైనా మేము ఎప్పుడు బిడ్డను కనాలనే ఒక టైమ్‌లైన్‌ను మాత్రం కచ్చితంగా నిర్ణయించుకున్నాం" అని సామ్ నాడు పేర్కొంది. అదే సమయంలో తల్లి కావడం వల్ల తన ప్రాధాన్యాలు ఎలా మారబోతున్నాయో కూడా సమంత వివరించింది. తనకు బిడ్డ పుట్టిన తర్వాత సినిమా పని కంటే కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది.


తనకు సంతానం కలిగితే ఆ బిడ్డ మాత్రమే తన ప్రపంచంగా మారుతుందని, ఉద్యోగం చేసే తల్లులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని సమంత నాటి ఇంటర్వ్యూలో చెప్పింది. తన బాల్యం అంతగా బాగుండలేదని, చిన్నతనంలో కష్టాలు పడిన ఏ వ్యక్తి అయినా తమ పిల్లలకు తాము కోల్పోయిన ప్రతిదానిని అందించాలని కోరుకుంటారని, ఆ భావన తన మనస్సులో బలంగా నాటుకుపోయిందని తెలిపింది. అందుకే బిడ్డ పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాల పాటు తాను సినిమాలకు పూర్తి దూరంగా ఉండి, ఆ బిడ్డ కోసమే తన సమయాన్ని కేటాయిస్తానని నాడు వెల్లడించింది. అయితే, కాలక్రమేణా సమంత జీవితం మరో మలుపు తిరిగింది. నాగచైతన్యతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం డిసెంబర్ 2025లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. మరోవైపు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత తల్లి కాబోతోందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...