- ₹25,000 వరకు పరిహారం!
ముంబై: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసానికి గురైన కస్టమర్లకు ₹25,000 వరకు పరిహారం చెల్లిస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం ప్రకటించారు. మోసగాళ్లకు కస్టమర్లు పొరపాటున వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) షేర్ చేసిన కేసుల్లో కూడా ఈ పరిహారం అందుతుందని మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ డబ్బును ఆర్బీఐకి చెందిన 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్' నుండి చెల్లిస్తారు.
- పరిహార నిబంధనలు
- ఈ పరిహారం జీవితంలో ఒక్కసారి మాత్రమే పొందవచ్చు.
- కస్టమర్ మోసానికి గురయ్యారని నిర్ధారణ కావాలి, ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు.
- మోసపోయిన మొత్తంలో 15 శాతం సొమ్మును కస్టమరే భరించాలి (పరిహారం ₹25,000 లోపు ఉన్నా కూడా).
- పెద్ద మొత్తంలో మోసపోయినప్పటికీ, గరిష్ట పరిహారం ₹25,000 మాత్రమే ఉంటుంది.
- త్వరలో ముసాయిదాను విడుదల
66 శాతం డిజిటల్ మోసాలు ₹50,000 లోపునే జరుగుతున్నాయి, కాబట్టి చాలామందికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది .త్వరలో ఈ పరిహార విధానంపై ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదాను విడుదల చేస్తారు. సీనియర్ సిటిజన్లు మోసపోకుండా ఉండేందుకు అదనపు భద్రతా సాధనాలను ఆర్బీఐ తీసుకురానుంది.
No comments:
Post a Comment