- ఫిబ్రవరి 6న ప్రత్యేక కార్యక్రమం
- ఒత్తిడి లేని పరీక్షల కోసం సిద్ధం కండి
ప్రధాని నరేంద్ర మోడీ ఏటా విద్యార్థులతో నిర్వహించే 'పరీక్షా పే చర్చ' ఈసారి మరింత ప్రత్యేకంగా జరగనుంది. ఈ నెల 6వ తేదీన ప్రసారం కానున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్ను వీక్షించాల్సిందిగా దేశ ప్రజలందరికీ ప్రధాని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. యువతతో మమేకం కావడం తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని, పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సవాళ్లను అధిగమించడం, జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సంబంధించిన ఆచరణాత్మక చిట్కాలను ప్రధాని ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు.
ఈ సంవత్సరం ఈ ముఖాముఖి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం విశేషం. దేవ్ మొగ్రా, కోయంబత్తూరు, రాయ్పూర్, గువహటితో పాటు ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో 'ఎగ్జామ్ వారియర్స్' (పరీక్షా యోధుల)తో ప్రధాని ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులు పరీక్షలను ఒక పండుగలా జరుపుకోవాలని, భయపడకుండా తమ ప్రతిభను చాటాలని కోరుతూ రూపొందించిన ఈ ఎపిసోడ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.
No comments:
Post a Comment