Sunday, 8 February 2026

భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యం



  • జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీపై ఉమ్మడి కార్యాచరణకు అంగీకారం
  • డ్రగ్స్, నేరాల నియంత్రణపై కీలక ఒప్పందం!

భారతదేశం , కెనడా దేశాలు జాతీయ భద్రత, చట్ట అమలు , సైబర్ భద్రత అంశాలపై సహకారాన్ని పటిష్టం చేసుకోవడానికి అంగీకరించాయి. ఇరుదేశాల ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని, భద్రతాపరమైన అంశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించాయి. కెనడాలోని ఒట్టావాలో శనివారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల పౌరుల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని ఇరువర్గాలు అంగీకరించాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. దీనికోసం ప్రతి దేశం తమ భద్రతా ,చట్ట అమలు అధికారిని నియమించుకుంటుందని, దీనివల్ల డ్రగ్స్ అక్రమ రవాణా, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు వంటి అంశాలపై సమాచార మార్పిడి సులభతరం అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా, సైబర్ సెక్యూరిటీ విధానంపై సహకారాన్ని అధికారికం చేసుకోవడం మరియు సైబర్ నేరాలు, మోసాలు, వలసల అమలు వంటి అంశాలపై చర్చలను కొనసాగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఈ సమావేశానికి ముందు శుక్రవారం అజిత్ దోవల్ కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి గ్యారీ ఆనందసంగారితో కూడా భేటీ అయ్యారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...