- రెండో స్థానంలో బీఆర్ఎస్
- మూడోస్థానంలో బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రారంభ ఫలితాల సరళిని పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ 800+ వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యతతో ముందంజలో ఉంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) 400+ వార్డుల్లో ఆధిక్యతతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ (BJP) 80+ వార్డుల్లో ఆధిక్యతతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 80 పైగా వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల వారీగా ఫలితాలు వెలువడుతున్న కొద్దీ అధికారికంగా ప్రకటించనున్నారు.
No comments:
Post a Comment