- మూడురోజుల పాటు ఛత్తీస్గఢ్లో అమిత్ షా పర్యటన
- మావోయిస్టుల అణిచివేతపై అత్యున్నతస్థాయి సమీక్ష
కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక పోరాటం కీలక దశకు చేరుకుంది. భద్రతా బలగాలు మావోయిస్టుల కంచుకోటల్లోకి చొచ్చుకువెళ్తూ భారీగా ఎన్కౌంటర్లు నిర్వహిస్తుండటంతో, వారి ప్రాబల్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో, మిగిలి ఉన్న సవాళ్లను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కేవలం సైనిక చర్యలే కాకుండా, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, టెలికాం , విద్యా సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా నక్సలిజానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కేంద్రం భావిస్తున్నది. అమిత్ షా పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
No comments:
Post a Comment