- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మనోజ్ ఝా ఆరోపణ
న్యూఢిల్లీ: భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ముసాయిదా దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ కుమార్ ఝా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా భారీ ప్రయోజనాలు కలుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్న విషయాలు "ప్రజలను తప్పుదోవ పట్టించేలా" ఉన్నాయని ఆయన ఆరోపించారు.
- సుంకాల పెంపు - ఆర్థిక నష్టం
భారతదేశం గతంలో విధిస్తున్న 2.9 శాతం సుంకాన్ని అమెరికా బెదిరింపుల కారణంగా 50 శాతానికి పెంచి, ఆ తర్వాత 18 శాతానికి తగ్గించారని ఝా పేర్కొన్నారు. పాత సుంకం (2.9 శాతం) కంటే కొత్త సుంకం (18 శాతం) చాలా ఎక్కువని, ఇది దేశానికి లాభం కాదని నష్టమని ఆయన వాదించారు. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తే, ముఖ్యంగా మన దేశ వ్యవసాయ రంగం తీవ్రమైన ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం పూర్తి ప్రతికూల పరిణామాలు ప్రజలకు తెలిస్తే, దేశవ్యాప్తంగా "వీధులపై నిరసనలు" జరుగుతాయని మనోజ్ ఝా హెచ్చరించారు. ఈ ఒప్పందం విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టిన ఝా, దీని వల్ల దేశ సార్వభౌమాధికారం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment