Wednesday, 17 December 2025

తెలంగాణ పల్లెపోరు.. ముగిసిన మూడో దశ పోలింగ్‌




హైదరాబాద్‌: తెలంగాణలో మూడో దశ ఎన్నికల (telangana Panchayat elections) పోలింగ్‌ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్‌ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్‌, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...