Wednesday, 17 December 2025

తెలంగాణ పల్లెపోరు.. ముగిసిన మూడో దశ పోలింగ్‌




హైదరాబాద్‌: తెలంగాణలో మూడో దశ ఎన్నికల (telangana Panchayat elections) పోలింగ్‌ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్‌ ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ ఎన్నిక చేపడతారు. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్‌, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...