Wednesday, 17 December 2025

గత 11 ఏళ్లలో భారత్ తన 'ఎకనామిక్ డీఎన్ఏ'ను మార్చుకుంది


  •  ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోడీ



మస్కట్ (ఒమన్): ప్రధాని నరేంద్ర మోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిరోజైన గురువారం ఒమన్‌లో జరిగిన 'ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్'లో ప్రసంగించారు. గత 11 ఏళ్లలో భారత్ కేవలం తన విధానాలను మాత్రమే కాకుండా, తన ఆర్థిక \వ్యవస్థ మూలాలను (Economic DNA) కూడా సమూలంగా మార్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.


ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు


11 ఏళ్ల కిందట ఉన్న భారత్‌కు, నేటి భారత్‌కు ఎంతో వ్యత్యాసం ఉందని.. జీజీఎస్టీ (GST), దివాలా కోడ్ (  'ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టెన్సీ కోడ్ IBC) వంటి సంస్కరణలతో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయని మోడీ పేర్కొన్నారు.భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటిగా ఎదిగిందని, పెట్టుబడిదారులకు గొప్ప అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు.


 భారత్-ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ఇరు దేశాల మధ్య వాణిజ్య వేగాన్ని మరింత పెంచుతుందని, ఇది భవిష్యత్తుకు ఒక 'బ్లూప్రింట్' అని ఆయన అభివర్ణించారు.రేబియా సముద్రం భారత్, ఒమన్ దేశాలను కలిపే ఒక బలమైన వారధి అని, వేల ఏళ్ల నాటి మన సముద్ర వాణిజ్య సంబంధాలను నేటి ఆధునిక కాలంలో మరింత బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు. భారత్-ఒమన్ దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మైత్రి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి.








No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...