ఉత్తర భారత దేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రయాణికులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తర భారత దేశంలోని పలు విమానాశ్రయాల్లో దృశ్యమానత (Visibility) తగ్గడంతో విమానాల రాకపోకల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్లైన్స్ ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్ ను సరిచూసుకోవాలని AAI కోరింది. అదనపు ప్రయాణ సమయాన్ని కేటాయించుకోవాలని సూచించింది. వారణాసి, పట్నా, రాంచీ ప్రాంతాల్లో తక్కువ దృశ్యమానత కారణంగా విమాన షెడ్యూల్లు మారే అవకాశం ఉందని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులను అప్రమత్తం చేసింది.
ఢిల్లీ పరిస్థితి
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతానికి విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం (AQI 358) 'అత్యంత దారుణమైన' కేటగిరీలో కొనసాగుతోంది.
ఉత్తర భారత్ వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ ఉండాలని అధికారులు కోరుతున్నారు.
No comments:
Post a Comment