న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (VB-G RAM G) బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు తన అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేయనున్నారు.
కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం ద్వారా మహాత్మా గాంధీ పేరును తొలగించడం, దాని వెనుక ఉన్న ఉద్దేశంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మహాత్మా గాంధీని దేశంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా భావిస్తారని, ఆయన పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.
ప్రజాధనం వృథా అవుతుంది:
"పథకం పేరు మార్చడం ద్వారా కార్యాలయాలు, స్టేషనరీ, పేపర్వర్క్పై ప్రభుత్వం భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద ఖరీదైన ప్రక్రియ. అనవసరంగా ఇలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదు. ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయి" అని ప్రియాంక గాంధీ విమర్శించారు. అయితే, కేంద్రం ఈ బిల్లు ద్వారా ఉపాధి హామీ దినాలను 100 నుంచి 125కు పెంచడం, కనీస వేతనాన్ని రూ. 240కి సవరించడం వంటి అంశాలను కూడా చేర్చింది
No comments:
Post a Comment