Tuesday, 16 December 2025

తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

3,752 సర్పంచి పదవులకు పోలింగ్‌




తెలంగాణలో మూడో దశ (చివరి దశ) పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది స్త్రీలు, 140 మంది ఇతరులతో కలిపి మొత్తం 53,06,395 మంది 36,452 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.



మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు.  394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది పోటీ చేస్తున్నారు. 36,452 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా 116కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7,908 ఏకగ్రీవమయ్యాయి. 18 వార్డులలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 28,410 వార్డులకు 75,725 మంది బరిలో ఉన్నారు





No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...