- ప్రధాని మోడీ నివాళులు
న్యూఢిల్లీ: సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులు (సాహిబ్జాదేలు) చేసిన అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా శుక్రవారం 'వీర్ బాల్ దివస్'ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహిబ్జాదేల సాహసాన్ని, వారి అచంచలమైన విశ్వాసాన్ని కొనియాడారు.
త్యాగాల స్మరణ
సాహిబ్జాదేలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ల బలిదానాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ రోజు ధైర్యానికి, ధర్మానికి ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జాతీయస్థాయి కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. మాతా గుజ్రీ జీ విశ్వాసం, గురు గోవింద్ సింగ్ బోధనలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఇదే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 20 మంది బాలలకు 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్'లను అందజేశారు. చిన్న వయసులోనే సాహిబ్జాదేలు చూపిన తెగువ, అన్యాయంపై వారు చేసిన పోరాటం భారత చరిత్రలో అజరామరమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.
No comments:
Post a Comment