- నిర్మాణాత్మక చర్చ జరిగింది: పి.పి. చౌదరి
- రాష్ట్రాల హక్కులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి: కపిల్ సిబల్
న్యూ ఢిల్లీ: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ నెలలో రెండవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పాల్గొని తన అభిప్రాయాలను కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సంస్కరణ విషయంలో రాష్ట్రాల హక్కులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కపిల్ సిబల్ చెప్పినట్లు సమాచారం.జేపీసీ చైర్మన్, బీజేపీ ఎంపీ పి.పి. చౌదరి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై చాలా మంచి, నిర్మాణాత్మక చర్చ జరిగిందని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి సభ్యుడు తమ సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తారని పేర్కొన్నారు.ఈ ఎన్నికల సంస్కరణ చాలా పెద్దది కాబట్టి, నివేదికను సమర్పించడానికి మరికొంత గడువు కావాలని కమిటీ కోరింది. కమిటీ తదుపరి సమావేశం డిసెంబర్ 17న జరగనుంది.
No comments:
Post a Comment