నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ కేసులో అసలైన నేరం లేదని కోర్టు తేల్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గాలిలో అనేక ఆరోపణలు చక్కర్లు కొట్టాయి, కానీ చట్టం మాత్రం భూమిపై దృఢంగా నిలబడింది" అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసును వాడుకుందని, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ విచారణలు సాగాయని ఆయన విమర్శించారు. చివరకు న్యాయమే గెలిచిందని, రాజకీయ ప్రేరేపిత కేసులకు కాలం చెల్లిందని సింఘ్వీ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment