- 2025లో శాంతి, భద్రత అభివృద్ధిలో చారిత్రాత్మక విజయాలు
- ఐజీ పి. సుందర్రాజ్
జగదల్పూర్ (ఛత్తీస్గఢ్): ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు ప్రగతిపథంలో దూసుకుపోతోంది. 2025 సంవత్సరం బస్తర్ చరిత్రలో భద్రత, అభివృద్ధి పరంగా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ శనివారం ప్రకటించారు.
నమ్మకాన్ని పెంచిన పోలీసింగ్
గత ఏడాదితో పోలిస్తే మావోయిస్టుల హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. భద్రతా దళాల పటిష్టమైన చర్యల వల్ల అనేక కీలక ప్రాంతాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయి. ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరారు. ఇది భద్రతా దళాల నైతిక విజయాన్ని సూచిస్తుందని ఐజీ తెలిపారు. సుదూర అటవీ ప్రాంతాలలో కొత్తగా రహదారులు, వంతెనలు, మొబైల్ టవర్ల నిర్మాణం వేగంగా సాగింది. దీనివల్ల గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం. ఇతర ప్రభుత్వ సేవలు సులభంగా చేరుతున్నాయి. 'విశ్వాసం, వికాసం , భద్రత' అనే నినాదంతో పోలీసులు ప్రజలకు చేరువయ్యారు. స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది. "2025లో సాధించిన విజయాలు మా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. బస్తర్లో పూర్తిస్థాయి శాంతిని నెలకొల్పడానికి మరియు ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం" అని ఐజీ సుందర్రాజ్ ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment