Sunday, 14 December 2025

'ఓటు దొంగ, గద్దె దిగిపో'


  • ర్యాలీకి ముందు కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు
  • బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనం ద్వారా ఏర్పడిందని ఆరోపణ



న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం "ఓట్ల దొంగతనం" ద్వారా ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్‌నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఓటు దొంగ, గద్దె దిగిపో" ర్యాలీ దేశవ్యాప్తంగా ఈ సందేశాన్ని తీసుకెళ్తుందని ఆయన అన్నారు.


న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆదివారం భారీ ర్యాలీని నిర్వహించనున్నది. "ఓట్ల దొంగతనం"  'సర్‌' సమస్యపై తమ పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా.. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక రాజకీయ పోరాటంలో కీలకమైన చర్యగా పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు.


"ఓటు దొంగ, గద్దె దిగిపో" అనే నినాదంతో తాము రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ నాయకులు రాజేష్ ఠాకూర్ తెలిపారు. ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం జరుగుతోందని, దానిని తాము లాక్కోనివ్వమని ఆయన పేర్కొన్నారు. తమ లక్షలాదిమంది కార్యకర్తలు వారిని సింహాసనం దిగిపోవాలని డిమాండ్ చేస్తారని ఆయన అన్నారు. గతంలో కూడా 'సర్‌' సమస్యపై ఈ ప్రచారంలో భాగంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు లక్నోలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...