- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
ఢిల్లీలో రోజురోజుకు తీవ్రమవుతోన్న వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశరాజధానిని పీడిస్తున్న ఈ సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ప్రయోజనాలు కలిగించే విధానాల కంటే.. దీర్ఘకాల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. శుక్రవారం ఉదయం హానికర పొగమంచు ఢిల్లీలోని అనేక ప్రాంతాలను కమ్మేసింది. ఫలితంగా దృశ్య నాణ్యత బాగా పడిపోయింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4 కింద ఆంక్షల అమలును కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ 310గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ స్థాయులు 395గా నమోదైనట్లు తెలిపింది.
No comments:
Post a Comment