- అక్షరధామ్, ఆనంద్ విహార్, ఘాజీపూర్ ప్రాంతాలలో ఏక్యూఐ గరిష్టంగా 438 గా నమోదు
ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం (డిసెంబర్ 21, 2025) ఉదయం జాతీయ రాజధాని నగరం దట్టమైన విషపూరిత పొగమంచు దుప్పటితో కప్పబడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, ఉదయం 7 గంటలకు సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 390గా నమోదై 'అత్యంత ప్రమాదకర'విభాగంలో ఉంది.
అయితే, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారి 'తీవ్రమైన' స్థాయికి చేరుకుంది. అక్షరధామ్, ఆనంద్ విహార్, ఘాజీపూర్ వంటి ప్రాంతాలలో ఏక్యూఐ గరిష్టంగా 438 కు చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీఓ ప్రాంతంలో 405గా రికార్డైంది.
కాలుష్యం తీవ్రత దృష్ట్యా, అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -IV నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అనవసర నిర్మాణ పనులు, డీజిల్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వేల వాహనాలకు జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
No comments:
Post a Comment