నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కేవలం గాంధీ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు.
బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ఈ కేసులో ఎటువంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదని, కేవలం రాజకీయ ప్రతీకారం కోసమే విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. "సత్యమేవ జయతే" అన్నదే మా నినాదమని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు ద్వారా ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్న మోదీ, అమిత్ షా లు తక్షణమే రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీ కూడా పాల్గొన్నారు. ఈడీని రాజకీయ ఆయుధంగా వాడుకుని కాంగ్రెస్ నాయకుల స్థైర్యాన్ని దెబ్బతీయలేరని వారు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment