- కోర్టు తీర్పుపై ప్రియాంక గాంధీ హర్షం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీటును (ప్రోసిక్యూషన్ ఫిర్యాదు) విచారణకు స్వీకరించడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. అంతిమంగా సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కోర్టు నిర్ణయం వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, "మేము మొదటి నుంచీ చెబుతున్నాం.. ఈ కేసులో ఎలాంటి వాస్తవం లేదని. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాపై ఆరోపణలు చేశారు. నేడు కోర్టు తీసుకున్న నిర్ణయంతో సత్యం వెలుగులోకి వచ్చింది. న్యాయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది, సత్యమే జయిస్తుంది" అని పేర్కొన్నారు.
- కోర్టు తీర్పు ముఖ్యాంశాలు
ఈ కేసు కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి (సుబ్రహ్మణ్య స్వామి) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైందని, దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ లేనందున మనీలాండరింగ్ చట్టం కింద విచారణ జరపడం చట్టబద్ధం కాదని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు. సరైన ఆధారాలు చట్టపరమైన విధివిధానాలు పాటించకుండా దాఖలైన ఈ ఫిర్యాదు చెల్లదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గాంధీ కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది. అయితే, దీనిపై పైకోర్టుకు వెళ్తామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment