యమునా ఎక్స్ప్రెస్ వే (ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారి)పై ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొత్తం ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
No comments:
Post a Comment