Thursday, 15 January 2026

ఓట్‌ చోరీ దేశద్రోహంతో సమానం

Leader of Opposition in Lok Sabha, Rahul Gandhi (File Photo/ANI)
రాహుల్ గాంధీ ఫైర్‌
ఎన్నికల కమిషన్ తీరుపై 'ఎక్స్' వేదికగా ఘాటు విమర్శలు!


ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల నిర్వహణ తీరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పోలింగ్ సమయంలో ఓటర్ల వేలిపై వేసే శాశ్వత సిరాకు బదులుగా, సాధారణ మార్కర్ పెన్నులను వాడారనే వివాదంపై ఆయన స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికల కమిషన్ పౌరులను తప్పుదోవ పట్టించడం వల్లే మన ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలుతున్నది" అని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో పేర్కొన్నారు. ఓట్‌ చోరీ (Vote Chori) అనేది అత్యంత హేయమైన, దేశ వ్యతిరేక చర్య (Anti-national act) అని ఆయన అభివర్ణించారు.

ఓటరు వేలిపై గుర్తు చెరిగిపోయేలా ఉండటం అక్రమాలకు దారితీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యవ్యవస్థలను కొందరు తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్లు మాయమవ్వడం, ఈ సిరా వివాదం వంటివి చూస్తుంటే ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడమేనని, అక్రమాలకు పాల్పడే వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...