Saturday, 31 January 2026

భారత్ - అరబ్ దేశాల మధ్య సరికొత్త బంధం


  •  ఢిల్లీలో అరబ్ విదేశాంగ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ


న్యూఢిల్లీ:న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత్-అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్, వివిధ దేశాల ప్రతినిధి బృందాలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ మరియు అరబ్ ప్రపంచం మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్రాత్మక సంబంధాలను ప్రధాని గుర్తుచేశారు. ఉమ్మడి సంస్కృతి, ప్రజల మధ్య ఉన్న లోతైన అనుబంధమే ఇరుదేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన కొనియాడారు.



భారత్ - అరబ్ దేశాల భాగస్వామ్యంపై తన దార్శనికతను వివరిస్తూ.. రాబోయే కాలంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత , ఆరోగ్య రంగాలలో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం ప్రాధాన్యం కలిగిన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ భాగస్వామ్యం కేవలం ఆర్థిక సంబంధాలకే పరిమితం కాకుండా, ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. గాజా శాంతి ప్రణాళికతో సహా ప్రాంతీయ శాంతి,  స్థిరత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పడానికి అరబ్ లీగ్ పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ప్రధాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...