Friday, 23 January 2026

ఉత్తరాదిపై వరుణుడి పంజా


  • హిమాచల్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
  • ఢిల్లీలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరియు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.



మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కింలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయువ్య భారతదేశంలో రానున్న రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పడిపోయే అవకాశం ఉంది. శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం మళ్ళీ ఆందోళన కలిగిస్తున్నది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాల ప్రకారం, నేడు మధ్యాహ్నం 1 గంట సమయానికి ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 278గా నమోదైంది. ఇది 'పేలవమైన'  కేటగిరిలోకి వస్తుందని, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...