- నజీరాబాద్ అగ్నిప్రమాదంపై నిష్పక్షపాత విచారణకు డిమాండ్
- పశ్చిమ బెంగాల్లో అమిత్ షా గర్జన
బారక్పూర్: పశ్చిమ బెంగాల్లోని మతువా , నమఃశూద్ర వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బారక్పూర్లోని ఆనంద్పురి మైదానంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగి తీరుతుందని, మతువా, నమఃశూద్ర వర్గాల వారు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లో ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని, దీనివల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన మండిపడ్డారు.
మరోవైపు దక్షిణ 24 పరగణాల జిల్లా నరేంద్రపూర్లోని నజీరాబాద్లో జరిగిన గోదాము అగ్నిప్రమాదంపై అమిత్ షా స్పందిస్తూ.. 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన అధికార పార్టీ అవినీతికి పరాకాష్ట అని, మృతుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అధికార పార్టీకి అత్యంత సన్నిహితులు ఈ ఘటనలో ప్రమేయం కలిగి ఉన్నారని, అందుకే సదరు మోమో కంపెనీ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆయన ఆరోపించారు. బెంగాల్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
No comments:
Post a Comment