Thursday, 15 January 2026

బీఎంసీ ఎన్నికల రణం


  • చీలికల మధ్య ముంబై మున్సిపల్ పోరు 
  • మళ్ళీ తెరపైకి రాజ్ ఠాక్రే వివాదాస్పద నినాదం

భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా, శివసేన ఇప్పటికే రెండువర్గాలుగా చీలిపోయింది. అటు ఎన్సీపీలో జరిగిన చీలిక కూడా ఈ ఎన్నికల ముఖచిత్రాన్ని మరింత క్లిష్టంగా మార్చేసింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లోపించడంతో, ఆసియాలోనే అతిపెద్ద పౌర సంస్థపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు పార్టీల మనుగడకు. విశ్వసనీయతకు ఒక అగ్నిపరీక్షగా మారింది.



ఈ ఉత్కంఠభరితమైన ఎన్నికల వాతావరణంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన పాత అస్త్రానికి మళ్ళీ పదును పెట్టారు. మరాఠీ అస్తిత్వం, స్థానికులకే ఉద్యోగాలు, రాజకీయ ఆధిపత్యమే లక్ష్యంగా ఆయన తన పాత వివాదాస్పద నినాదం "లుంగీ హటావో, పుంగీ బజావో"ను మళ్ళీ వినిపిస్తున్నారు. ముంబైలో ప్రాంతీయవాదాన్ని రగిలించడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. బహుముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల క్షేత్రంలో రాజ్ ఠాక్రే అనుసరిస్తున్న ఈ సాంస్కృతిక రాజకీయ వ్యూహం ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సంపన్నమైన బీఎంసీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...