- లోక్కల్యాణ్ మార్గ్లో గోవులకు స్వహస్తాలతో గ్రాసం తినిపించిన ప్రధాని
- దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. ఢిల్లీలోని 7-లోక్కల్యాణ్ మార్గ్లో ఉన్న తన అధికారిక నివాసంలో ప్రధాని గోవులకు స్వహస్తాలతో గ్రాసాన్ని తినిపించి గోసేవ చేశారు. ఈ సందర్భంగా పచ్చటి గడ్డిని, పిండిని ఆవులకు తినిపిస్తూ ఆయన వారితో కాసేపు గడిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మన సంస్కృతిలో గోవును లక్ష్మీస్వరూపంగా భావిస్తామని, పండుగ రోజున గోసేవ చేయడం పరమ పవిత్రమని ప్రధాని ఈ సందర్భంగా చాటిచెప్పారు.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తరుణంలో దేశ ప్రజలందరికీ ఆయన మకర సంక్రాంతి, పొంగల్, మాఘీ, బిహు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధించే మన సంప్రదాయాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కూడా సంక్రాంతి పండుగనాడు ప్రధాని తన నివాసంలో ఉన్న 'పుంగనూరు' జాతి ఆవులకు మేత తినిపించిన విషయం విదితమే. ప్రతి ఏటా పండుగ వేళ ఆయన ఇలా గోవులతో సమయాన్ని గడపడం గమనార్హం.
No comments:
Post a Comment