Monday, 6 April 2026

పశ్చిమాసియాలో శాంతి గీతం


  • అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సిద్ధమైన ‘కీలక ముసాయిదా’!

వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో పెను యుద్ధం సంభవిస్తుందన్న ఆందోళనల మధ్య ఒక ఊరటనిచ్చే వార్త వెలువడింది. అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని వీడి, తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించేందుకు అవసరమైన ఒక అధికారిక ముసాయిదాను అందుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఐరోపా దేశాలు , కొన్ని అరబ్ దేశాల మధ్యవర్తిత్వంతో రూపొందిన ఈ ప్రతిపాదనపై ఇరు దేశాలు సానుకూలంగా స్పందిస్తే, రానున్న కొన్నిగంటల్లోనే అధికారికంగా యుద్ధ విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.



ఈ ప్రతిపాదిత ముసాయిదా ప్రకారం, అమెరికా, ఇరాన్ తమ అన్నిరకాల వైమానిక , క్షిపణి దాడులను తక్షణమే నిలిపివేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని నిబంధనల ప్రకారం తిరిగి తెరవడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం. అమెరికా తన పైలట్ల భద్రత, తన సైనిక స్థావరాలపై దాడులు జరగకుండా హామీ కోరుతుండగా, ఇరాన్ తన దేశంలోని ఇంధన , అణు మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ చర్చలు సఫలమైతే, ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడమే కాకుండా, పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల ఉన్నతస్థాయి నాయకత్వం ఈ ముసాయిదాను పరిశీలిస్తోంది.

No comments:

Post a Comment

Featured post

కాంగ్రెస్‌ ఎప్పటినుంచో పాక్‌ పాట పాడుతోంది

ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు అసోం: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ ఎప్పటి నుంచో పాకిస్...