Friday, 17 April 2026

టీసీఎస్ మత మార్పిడి వ్యవహారం


  • నిందితురాలు నిదా ఖాన్ ఆచూకీ చెప్పిన భర్త
  • కానీ అక్కడికి వెళ్లిన పోలీసులకు షాక్!

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడిల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో, ముంబైలో ఉన్న ఆమె భర్త ఒక చిరునామాను పోలీసులకు అందించారు. అయితే పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ నిదా ఖాన్ కనిపించలేదు సగదా.. ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో దర్యాప్తు అధికారులకు చుక్కెదురైంది.



మరోవైపు నిదా ఖాన్ తరపు న్యాయవాదులు నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, ముంబైలోని తన ఇంట్లోనే ఉందని ఆమె కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. పోలీసులకు భయపడి ఆమె ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆమెను ప్రధాన సూత్రధారిగా భావిస్తూ 'సిట్' (SIT) ద్వారా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కంపెనీలో మహిళా ఉద్యోగులను ట్రాప్ చేయడం, మత మార్పిడి కోసం ఒత్తిడి తేవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.


ఈ వ్యవహారంపై టీసీఎస్ యాజమాన్యం కూడా కఠినంగా స్పందించింది. నిదా ఖాన్‌తో పాటు మరికొందరు నిందితులను ఇప్పటికే కంపెనీ నుండి సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలపై హెచ్‌ఆర్ విభాగానికి చెందిన కొందరిని కూడా విచారిస్తున్నారు. డెలాయిట్ వంటి బయటి సంస్థలతో ఆడిట్ చేయిస్తూ ఈ వ్యవహారంలో ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో టీసీఎస్ అంతర్గత విచారణ జరుపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిదా ఖాన్ దొరికితేనే ఈ మత మార్పిడి రాకెట్ వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Featured post

హార్ముజ్ జలసంధి 'పూర్తిగా ఓపెన్'

కానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కొత్త కొర్రీలు! ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరుస్తున్న...