Friday, 27 March 2026

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు


శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు కాషాయ జెండాలు చేబూని, సంప్రదాయ వాయిద్యాల నడుమ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శ్రీరాముడి ప్రతిమలతో అలంకరించిన రథాలు , రామలక్ష్మణుల వేషధారణలో ఉన్న కళాకారులు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.






No comments:

Post a Comment

Featured post

ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్

 జోధ్‌పూర్‌లో దారుణం ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్ న్యాయం జరక్క ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య రాజస్థాన్‌లో రగిలిపోతున్న నిరసన జ్వా...