దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాకు సంబంధించి కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్లో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని, ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో ఇంధన కొరత అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు జరుగుతున్న ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. అన్ని రీటైల్ బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఇంధన భద్రత విషయంలో దేశం సురక్షితంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరోవైపు, అంతర్జాతీయంగా భారత నౌకల రాకపోకలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వివరాలు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరంగా మారిన హార్ముజ్ జలసంధి గుండా ఇప్పటికే నాలుగు భారీ ఎల్పీజీ నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకున్నాయని ఆయన తెలిపారు. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు. గ్లోబల్ డైనమిక్స్ను నిరంతరం పర్యవేక్షిస్తూ, భారత నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
హర్మూజ్ జలసంధిలో దాడిని తట్టుకుని.. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు సురక్షితంగా చేరిన చమురు ట్యాంకర్
భువనేశ్వర్/పారాదీప్: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హర్మూజ్ జలసంధిలో అపరిచిత శక్తుల నుంచి తుపాకీ కాల్పుల (Gunfire) దాడిన...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
No comments:
Post a Comment