- హిందూ పక్షం తరఫు న్యాయవాది ప్రత్యేక ఇంటర్వ్యూ
- సర్వే నివేదిక ఆధారంగా కోర్టులో తేలనున్న అసలు నిజాలు!
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న చరిత్రాత్మక భోజ్శాల-కమల్ మౌలా మసీదు (Bhojshala) వివాదంలో కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై హిందూ పక్షం తరఫు సీనియర్ న్యాయవాది ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వివరాలను వెల్లడించారు. ఈ శతాబ్దాల నాటి వివాదాస్పద కట్టడం , అసలు స్వరూపాన్ని, చరిత్రాత్మక నేపథ్యాన్ని వెలికితీసేందుకు పురావస్తు శాఖ (ASI) జరిపిన శాస్త్రీయ సర్వే ప్రక్రియ ముగిసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదంలో హిందూ పక్షం తదుపరి చట్టపరమైన వ్యూహం ఏంటనే దానిపై ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు.
భోజ్శాల ప్రాంగణంలో లభించిన ఆధారాలు, శాసనాలు, విగ్రహాల అవశేషాలు అది ఒకప్పుడు సరస్వతీ దేవి ఆలయమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని హిందూ పక్షం లాయర్ ధీమా వ్యక్తం చేశారు. ఏఎస్ఐ సమర్పించబోయే సమగ్ర సర్వే నివేదిక ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు కానుందని, ఆ నివేదిక ఆధారంగానే తాము కోర్టులో బలమైన వాదనలు వినిపించబోతున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం భోజ్శాల ప్రాంగణంపై హిందువులకు పూర్తి హక్కులు కల్పించడమే తమ తదుపరి లక్ష్యమన్నారు. చట్టపరమైన నిబంధనలకు లోబడి, కోర్టు పరిధిలోనే తాము ఈ పోరాటాన్ని ముగింపు దశకు తీసుకెళ్తామని, త్వరలోనే న్యాయస్థానం నుండి ఒక చారిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు న్యాయవాది పేర్కొన్నారు.
No comments:
Post a Comment