- బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి భావోద్వేగ ప్రకటన!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది నిమిషాల ముందు సువేందు అధికారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందని, 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) కల సాకారమయ్యే కాలం అధికారికంగా ఆరంభమైందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి బెంగాల్ ఎదురుచూస్తున్న అభివృద్ధి, శాంతి , ప్రగతిపథంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే తన ప్రథమ కర్తవ్యమని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో, బెంగాల్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, వివక్ష లేని పాలనను అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ చరిత్రాత్మక మార్పు కేవలం ఒక పార్టీ విజయం కాదని, ఇది బెంగాల్ కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు దక్కిన విజయమని సువేందు అభివర్ణించారు. గత పాలకుల హయాంలో రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెస్తామని, యువతకు ఉపాధి, రైతులకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకార వేదికకు బయలుదేరే ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. బెంగాల్ గడ్డపై కమల వికాసం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నేటి నుంచి ప్రతి బెంగాలీ గర్వపడేలా తమ పాలన సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment