తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంటోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ నేడు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో భేటీ కానున్నారు. తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ ఇప్పటికే గవర్నర్కు లేఖ పంపారు. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా ధ్రువీకరించారు.
ప్రస్తుతం 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం పది అడుగుల దూరంలో నిలిచింది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ప్రకటించినప్పటికీ, మరో ఐదుగురు సభ్యుల మద్దతు అనివార్యమైంది. ఈ క్రమంలో ఏఐఏడీఎంకే (AIADMK) మద్దతు పొందేందుకు టీవీకే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఇప్పటికే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) తో చర్చలు జరిపారు. ఒకవేళ 47 స్థానాలు ఉన్న ఏఐఏడీఎంకే కనుక మద్దతు ఇస్తే, విజయ్ ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏఐఏడీఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వారు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల కాలంగా డీఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకుని మరీ కాంగ్రెస్ విజయ్కు మద్దతు ఇవ్వడం విశేషం. గవర్నర్తో జరగబోయే ఈ సాయంత్రం భేటీ తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది.
No comments:
Post a Comment